ఓటమిని అంగీకరిస్తున్నాం – బసవరాజ్ బొమ్మై

-

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బెంగుళూరు, కోస్టల్ కర్ణాటకలను మినహాయిస్తే మిగతా అన్ని ప్రాంతాలలోనూ కాంగ్రెస్ హవా కొనసాగిస్తోంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో బిజెపి అధిక సంఖ్యలో స్థానాలను గెలుచుకున్న ప్రాంతాలలో కూడా ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పాగా వేయగలిగింది. ఇక కర్ణాటక ముఖ్యమంత్రి, బిజెపి అభ్యర్థి బసవరాజ్ బొమ్మై.. షిగ్గావ్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

 

కాంగ్రెస్ అభ్యర్థి యాసిర్ అహ్మద్ ఖాన్ పఠాన్ పై గెలుపొందినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ.. కర్ణాటక ఎన్నికలలో బిజెపి ఓటమిని అంగీకరిస్తున్నామని పేర్కొన్నారు. గెలుపు దిశగా వెళుతున్న కాంగ్రెస్ కి శుభాకాంక్షలు తెలిపారు. పూర్తిస్థాయి ఫలితాలు వచ్చిన తర్వాత తాము విశ్లేషించుకుంటామని చెప్పారు బొమ్మై. జాతీయ పార్టీగా వివిధ స్థాయిలో ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయో విశ్లేషించుకుంటామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news