కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ ఏ శంకర్ ట్రెజరర్ జయరాం కీలక నిర్ణయం తీసుకున్నారు. వారు తమ పదవులకు రాజీనామా చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగుళూరు తొక్కిసలాట ఘటనలో 11 మంది ఆర్సిబి అభిమానులు మరణించారు. దీంతో కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ శంకర్, జయరాం ఆర్సిబి అభిమానులు చనిపోయిన కారణంగా ఆ సంఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

గత రెండు రోజుల నుంచి దురదృష్టకరమైన సంఘటనలు, ఊహించని ఘటనలు చాలా జరిగాయి. ఈ ఘటనలో మా పాత్ర పరిమితమైనప్పటికీ రాజీనామా చేస్తున్నామని శంకర్, జయరాం పేర్కొన్నారు. కాగా, ఈ తొక్కిసలాట ఘటనలో ఆర్సిబి అభిమానులు మరణించారు. దీంతో చాలామంది ఈ ఘటనపై స్పందిస్తున్నారు. కోహ్లీని కూడా అరెస్టు చేయాలని చాలామంది డిమాండ్ చేశారు. కోహ్లీని చూడడం కోసమే అభిమానులు భారీగా వచ్చారని అక్కడ ఎక్కువ మంది ఉండడం వల్ల పోలీసులు లాటి చార్జీ చేయడంతో తొక్కిసలాట జరిగింది. దీనివల్ల చాలామంది మరణించారు. మరికొంతమంది చికిత్స తీసుకుంటున్నారు. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.