ఈటల రాజకీయమంతా రక్తచరిత్రే : కౌశిక్ రెడ్డి

-

హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి విరుచుకు పడ్డారు. తాజాగా కేసీఆర్‌పై, తెలంగాణ ప్రభుత్వంపై ఈటల చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్‌పై ఈటల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, హెచ్చరికలను కౌశిక్ తిప్పి కొట్టారు.

ఈటల రాజేందర్ రాజకీయమంతా రక్తచరిత్రేనని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. గతంలో హుజురాబాద్‌ నియోజకవర్గంలోని నర్సింగాపూర్‌ ఎంపీటీసీ బాలరాజును హత్య చేయించింది ఈటలేనని ఆరోపణలు చేశారు. ఉద్యమకారుడు ప్రవీణ్‌ యాదవ్‌పై దాడి చేయించింది కూడా ఈటల రాజేందరేనని కౌశిక్‌ రెడ్డి పేర్కొన్నారు. సానుభూతి కోసమే ఉద్దేశపూర్వకంగానే శాసనసభ నుంచి ఈటల సస్పెండ్ అయ్యారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news