జాతీయ సమైక్యత, సమగ్రత ఉట్టిపడేలా కార్యక్రమాలు నిలిచిపోవాలి – కల్వకుంట్ల కవిత

-

సెప్టెంబర్ 17న హైదరాబాద్ ప్రాంతం భారత యూనియన్‌లో చేరిన సందర్భంగా ఇవాళ ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని’ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కల్వకుంట్ల కవిత ట్వీట్‌ చేశారు. రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య పాలన వైపు అడుగులేసిన తెలంగాణ నేడు సమైక్యతా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.

ఎమ్మెల్సీ కవిత
ఎమ్మెల్సీ కవిత

స్వరాష్ట్రంగా మారి సీఎం శ్రీ కేసీఆర్ గారి సారథ్యంలో ప్రగతి పథంలో పయనిస్తూ దేశంలో నంబర్ వన్ గా మారిందని గుర్తు చేశారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తోందన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు, కవులు,కళాకారులను సన్మానిస్తూ, అభివృద్ధి,సంక్షేమంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రజలకు వివరిస్తూ జాతీయ సమైక్యత, సమగ్రత ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహిస్తూ చరిత్రలో నిలిచిపోయేలా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను నిర్వహించుకోవడం కేవలం కేసిఆర్ గారి విశాల దృక్పథం వల్లే సాధ్యమైందని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news