నలుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్

-

మరి కొన్ని నెలల్లో దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు జాబితాను విడుదల చేస్తున్నా సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నాలుగు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను కేసిఆర్ ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈరోజు బీఆర్ఎస్ భవన్ లో జరిగిన భేటీ తర్వాత..4 స్థానాల్లో పోటీ చేసే వాళ్లను అధికారికంగా ప్రకటించారు.

కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి బి.వినోద్ కుమార్, పెద్దపల్లి ఎంపీ స్థానం నుంచి కొప్పుల ఈశ్వర్ ,ఖమ్మం పార్లమెంట్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ ఎంపీ స్థానం నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ అయిన మాలోతు కవితకు మళ్లీ అవకాశం ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news