తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్

-

తెలంగాణ హైకోర్టును మాజీ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సోమవారం ఆశ్రయించారు. రైలు రోకో సందర్భంగా తనపై నమోదైన కేసు విషయంలో కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ వేశారు.

ప్రజా ప్రతినిధుల కోర్టులోని కేసును కొట్టేయాలంటూ ఆ పిటిషన్‌లో కేసీఆర్ కోరారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో రైల్ రోకోకు కేసీఆర్ పిలుపునిచ్చారని పోలీసులు నివేదిక అందజేశారు. 2011 అక్టోబర్ 15, 16, 17 తేదీల్లో కేసీఆర్ రైల్ రోకోకు పిలుపునిచ్చారని పోలీసులు వెల్లడించారు. రైలు రోకో వల్ల రైలు రాకపోకలు, రైల్వే ఉద్యోగులకు ఆటంకం కలిగించారని పేర్కొన్నారు.ఎలాంటి రైలు రోకోకు పిలుపునివ్వలేదని కేసీఆర్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎవరో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసులు నమోదు చేశారని ,రైల్ రోకో ఘటన తర్వాత మూడేళ్లకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కేసీఆర్ పేర్కొన్నారు. ఆ కేసుకు ఎలాంటి బలం లేదని పిటిషన్‌లో తెలిపారు కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news