ప్రాజెక్టుల పేరుతో కెసిఆర్ ఫ్యామిలీ వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేసింది – రాజగోపాల్ రెడ్డి

-

ప్రాజెక్టుల పేరుతో కెసిఆర్ ఫ్యామిలీ రూ. వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేసిందని ఆరోపించారు బిజెపి నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వందలాది మంది ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణను కెసిఆర్ కుటుంబం దోచుకుంటుందని విమర్శించారు. 1400 మంది యువకుల ఆత్మబలి దానాలతో తెలంగాణ వస్తే.. కెసిఆర్ కుటుంబం రాజకీయ పాలన చేస్తూ ఉందని ఆరోపించారు.

మునుగోడు ఉప ఎన్నికను ప్రపంచంలోని ప్రతి తెలుగు వారు గమనిస్తున్నారని తెలిపారు. ప్రతిపక్షం లేకుండా చేసి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల అప్పుడు దళిత బంధు పథకం పెట్టారని.. మునుగోడు ఉప ఎన్నికల వేల గిరిజన బంధు పథకం తెస్తున్నారంటూ మండిపడ్డారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడులో బిజెపి గెలుపు ఖాయం అనే ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news