ఆర్టీసీ కార్మికుల‌కు షాక్‌.. కేసీఆర్ మ‌రో కీలక నిర్ణయం..

-

ఆర్టీసీ వ్యవహారం రోజు రోజుకి ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. ఇప్పటికే ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తి లేదని ఆర్టీసీ కార్మికులను డిస్మిస్ చేయడమే కాకుండా.. వారికి వైద్యాన్ని కూడా నిలిపివేసిన కేసీఆర్.. తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ఆర్టీసీ కండక్టర్‌లు, డ్రైవర్ల నియామకానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కండక్టర్‌లు, డ్రైవర్ల నియామకానికి కసరత్తు చేయాలని… అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు డ్రైవర్‌లు, కండక్టర్ల నియామకంపై.. రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ ఫైల్‌ను సిద్ధం చేయనున్నారు. ఆ తర్వాత కొత్త డ్రైవర్లు, కండక్టర్ల రిక్రూట్‌మెంట్‌పై ప్రభుత్వ నిర్ణయం తీసుకోనుంది. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆర్టీసీ కార్మిక సంఘాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news