గవర్నర్‌ను కలవనున్న సీఎం కేసీఆర్‌.. ఎందుకంటే..?

-

తెలంగాణ సీఎం కేసీఆర్‌ గవర్నర్ తమిళిసైని కలవనున్నారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు రాజ్‌భవన్‌లో భేటీకానున్నారు. ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై చర్చించనున్నారు. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ నిర్ణయాన్ని గవర్నర్‌కు వివరించనున్నారు సీఎం కేసీఆర్‌. ఆర్టీసీ భవితవ్యంపై సీఎం కేసీఆర్‌ ఇవాళ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

సంస్థ మనుగడ, రూట్ల ప్రైవేటీకరణపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అన్ని అంశాలను చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news