రేపు 20 జిల్లాల ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశం

-

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్. రానున్న వీటిపై జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలగురించి చర్చించేందుకు రేపు 20 జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు ముఖ్యమంత్రి. హైదరాబాద్ సహా ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్​నగర్, నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ అవుతారు.

గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై ఎమ్మెల్యేలతో చర్చిస్తారు. ఇప్పటికే వీరందరికీ ఫోన్లు వెళ్లినట్టు సమాచారం. ఇక ఇప్పటికే దుబ్బాక ఉపఎన్నికల హడావుడిలో హరీష్ రావు ఉన్నారు. కేసీఆర్ కూడా తన వంతుగా వ్యూహాలు పన్ననున్నట్టు చెబుతున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో సత్తా చాటి మరో మారు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అధికార పార్టీ అందుకు తగ్గ కసరత్తులు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news