కీర్తి సురేష్ ‘ మిస్ ఇండియా ‘ ట్రైలర్ విడుదల..!

-

మహానటి సినిమాలో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం ఆమె తాజాగా నటించిన మిస్ ఇండియా చిత్రానికి సంబంధించి ట్రైలర్ విడుదల చేసింది చిత్రబృందం. ఇక ఈ చిత్రం కూడా ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ ద్వారా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ప్రస్తుతం కీర్తి సురేష్ లీడ్ రోల్ లో సర్కార్ వారి పాట, రంగ్ దే సినిమాలో నటిస్తోంది. ఈ మధ్యకాలంలో ఈవిడ కేవలం గ్లామరస్ పాత్రలో మాత్రమే కాకుండా లేడి ఓరియెంటెడ్ చిత్రాలను కూడా చేస్తోంది. ఇటీవల కాలంలో అమెజాన్ ప్రైమ్ ప్లాట్ఫామ్ నుండి విడుదలైన పెంగ్విన్ చిత్రంలో కూడా లీడ్ రోల్ పోషించింది.

ఇప్పుడు ఇదే బాటలో మిస్ ఇండియా కూడా ఓటీటీ బాట పట్టింది. మిస్ ఇండియా ట్రైలర్ చూస్తే ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ట్రైలర్ చూసి ఆనందించండి.

Read more RELATED
Recommended to you

Latest news