Keerthy Suresh : మహబూబ్ నగర్ లో కీర్తి సురేష్..ఫోటోలు వైరల్

-

మహానటిగా కీర్తి సురేష్ తన నటనతో ప్రేక్షకులను ఎంతగా మెప్పించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమాలో ఈమె నటన చూసి స్టార్ హీరోలు సైతం ఫిదా అయ్యారు. ఇక అంతే కాదు తన నటనతో పాత్రను పండించగల ప్రతిభ కేవలం కీర్తి సురేష్ లో మాత్రమే ఉందని చెప్పడంలో సందేహం లేదు.


మొన్న మధ్య వరకూ వరుస ఫ్లాప్ లను చవిచూసిన ఈమె చివరికి చిన్ని సినిమాతో తన లో ఉన్న నటనను మళ్లీ బయటకు తీసి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటోంది.

ఇక తాజాగా మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ కళావతి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రత్యేకమైన గుర్తింపు లభించడంతో పాటు కీర్తి సురేష్ కామెడీ టైమింగ్ కు ప్రేక్షకులు సైతం ఫిదా అవుతున్నారు.

అయితే.. తాజాగా కీర్తి సురేష్‌ మహబూబ్‌ నగర్‌ లో పర్యటించింది. సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌ కార్యక్రమంలో ఈ బ్యూటీ పాల్గొంది. దీంతో ఇప్పుడు ఈ బ్యూటీ ఫోటోలు వైరల్‌ గా మారాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news