బ్రేకింగ్ : ఏడుగురు షట్లర్ లకు కరోనా పాజిటివ్…!

-

ఇండియా ఓపెన్ లో కరోనా కలకలం సృష్టించింది. పలువురు ఆటగాళ్లు కరోనా బారినపడ్డారు. స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయనతో కలిపి మొత్తం ఏడుగురికి కరుణ పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ అధికారికంగా ప్రకటించింది.

అశ్విని పొన్నప్ప, రితికా రాహుల్, మిథున్ మంజునాథ్, ఖుషి గుప్తా, ట్రేస్సా జోలీ, సిమ్రాన్ సింఘి లకు ప్రస్తుతం కరోనా పాజిటివ్ రాగా ప్లేయర్లను అందరినీ ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు BWF ప్రకటించింది. ఇక ఆటగాళ్లకు కరోనా రావడంతో వీరి డబుల్స్ పార్టనర్ లు టోర్నమెంట్ నుండి వైదొలిగారు. ఇదిలా ఉంటే ఈ రోజు ఒక్క రోజు దేశం లో రెండు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. దాంతో కరోనా థర్డ్ వేవ్ మొదలయిందని పలువురు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news