టాప్ షెట్లర్స్ కిదాంబి శ్రీకాంత్, అశ్విని పొన్నప్పలకు కోవిడ్ పాజిటివ్

-

దేశంలో కరోనా తీవ్రత పెరుగుతోంది. ఇప్పటికే రోజూవారీ కేసుల సంఖ్య లక్షను దాటి రెండు లక్షలకు చేరువఅవుతోంది. ఇదిలా ఉంటే చాలా మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఢిల్లీలో జరుగుతున్న ఇండియన్ ఓపెన్ 2022 బ్యాట్మింటన్ టోర్నమెంట్ లో కరోనా కలకలం కలిగిస్తోంది. స్టార్ షెట్లర్లు కిదాంబి శ్రీకాంత్, అశ్విని పొన్నప్పలతో పాటు మొత్తంగా 7గురు కరోనా బాారిన పడటం కలవరపెడుతోంది. కిదాంబి శ్రీకాంత్, అశ్విని పొనప్ప, రితికా ఠక్కర్, ట్రీసా జాలీ, మిథున్ మంజునాథ్, సిమ్రాన్ సింగ్ మరియు ఖుషీ గుప్తాలతో సహా టాప్ ఇండియన్ షట్లర్లు ఉన్నారు. ప్రస్తుతం వీరంతా టోర్ని నుంచి వైదొలిగారు. వీరితో సన్నిహితంగా ఉన్న వారికి కూడా కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు. ఈ ఏడుగురు ఆటగాళ్లకు సన్నిహితంగా ఉన్న డబుల్స్ భాగస్వాములు కూడా టోర్ని నుంచి వైదొలిగారు.

Read more RELATED
Recommended to you

Latest news