యూపీలో కిడ్నాప్.. కడపలో తప్పించుకున్న బాలుడు

-

ఉత్తరప్రదేశ్ లో  కిడ్నాప్ కు గరైన ఓ బాలుడు కడపలో తప్పించుకున్న వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్ లో కిడ్నాప్ కు గరైన క్షేత్ర కుమార్ దుబే (12) అనే బాలుడు కిడ్నాపర్ల చెర నుండి కడపలో తప్పించుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి కడప మీదుగా కారులో తీసు కెళ్ళే సమయంలో చాక చక్యం గా తప్పించుకున్నాడు ఆ పన్నెండేళ్ళ బాలుడు.

కడప రైల్వేస్టేషన్ సమీపంలో అనుమానంగా తిరుతుండగా గమనించిన రైల్వే పోలీసులు ఆరా తీయగా అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో కడప రైల్వే పోలీసులు క్షేత్ర కుమార్ తల్లిదండ్రులను పిలి పించి వారికి బాలుడిని అప్పగించాఉర్. ఈ వివరాలను రైల్వే పోలీస్ అధికారి శంకర్రావు మీడియాకు వెల్లడించారు.  అయితే అసలు కిడ్నాప్ చేయడానికి యత్నించింది ఎవరు అనేది సంచలనంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news