గుంటూరులో సంచరిస్తున్న కిడ్నాప్ ముఠా..!

-

గుంటూరు జిల్లాలో కిడ్నాప్ ముఠా కలకలం రేగింది. ఓ బాలుడిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన ముఠా సభ్యులు ఐడియా బెడిసికొట్టడంతో స్థానికులకు చిక్కారు. దీంతో అసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గుజ్జన గుండ్లలో ఇద్దరు వ్యక్తులు ఓ పిల్లాడికి చాక్లెట్ ఆశ చూపి కిడ్నాప్ చేయడానికి యత్నించారు. అయితే వారి దగ్గరి నుంచి ఆ బాలుడు తప్పించుకొని ఇంటికి వెళ్లి జరిగిన విషయం స్థానికులకు తెలియజేశాడు.

kidnap

కొద్దిసేపటి తర్వాత ఉద్యోగనగర్ ప్రాంతంలో ఓ దుండగుడు బురఖా ధరించి అటు ఇటూ అనుమానాస్పదంగా తిరుగుతూ మున్సిపల్ కార్మికులకు పట్టుబడ్డాడు. అనుమానించిన కార్మికులు వారిని పట్టుకొని తనిఖీ చేయగా సంచిలో కత్తులు, రాళ్లు, గ్లౌజులు లభ్యమయ్యాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించి వారికి అప్పగించారు.

ఇద్దరు వ్యక్తులు మాచర్లకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. బ్యాగ్ లో లభించిన వస్తువులను స్వాధీనం చేసుకోని వారిని విచారిస్తున్నారు. అయితే ఆ వ్యక్తులు ఆ బాలుడిని కిడ్నాప్ చేయడానికి వచ్చారా.. లేదంటే నిత్యం వారు ఇదే పనిచేస్తారా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. కానీ కత్తులు పట్టుకొని కాలనీలలో తిరుగుతున్నారనే సమాచారం గుంటూరు మొత్తం వ్యాపించడంతో అందరూ పిల్లలను బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంచుతున్నారు.

అయితే దుండగులు ఎవరన్నదానిపై స్థానికంగా చర్చ జరుగుతోంది. దుండగులు పారిపోయిన బాలుడ్ని కిడ్నాప్ చేసేందుకే వచ్చారా..? లేదా వారి వృత్తే కిడ్నాప్ చేయడమా అనేది తేలాల్సి ఉంది. బ్యాగులో కత్తులు, రాళ్లు ఉండటంతో కిడ్నాప్ చేసే సమయంలో అడ్డువచ్చిన వారిని బెదిరించడానికే.. లేక నిజంగానే హత్య చేయడంలాంటి ప్రణాలికలేమైనా ఉన్నాయా అనేది మిస్టరీగా మారింది. పట్టపగలు ఇద్దరు వ్యక్తులు మారుణాయుధాలతో సంచరించడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనలో మిస్టరీ వీడాలంటే దుండగులే నోరు విప్పాల్సిన అవసరముంది. అలాగే కిడ్నాప్ కు యత్నించిన బాలుడు, అతని కుటుంబ సభ్యులు దుండగులను గుర్తిస్తే నిజాలు బయటకివచ్చే అవకాశముంది.

Read more RELATED
Recommended to you

Latest news