ఢిల్లీ లో దారుణం.. చిన్న కారణానికి దారుణంగా కోసి చంపారు..!

-

రోజురోజుకు తెర మీదకి వస్తున్న ఘటనలు చూస్తుంటే సభ్యసమాజంలో జాలి దయ ఉన్న మనుషులు కరువై ఉన్మాదులుగా గా మారిపోతున్న మనషులే ఎక్కువవుతున్నారు అన్నది అర్థం అవుతుంది . ఎక్కడ చూసినా కనీసం జాలి దయ లేకుండా సాటి మనిషి ప్రాణాలను దారుణంగా తీసేస్తున్నారు. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. క్షణికావేశం ఏకంగా ఒక ప్రాణాన్ని బలితీసుకుంది. చిన్న కారణానికి ఏకంగా అతి కిరాతకంగా ప్రాణాలు తీశారు ఇద్దరు యువకులు.

ఢిల్లీలోని టిగ్రీ ప్రాంతంలో సతీష్ అనే 21 ఏళ్ల యువకుడు వీధిలో ఊరికే పని పాట లేకుండా తిరుగుతున్న పీయూష్ అనే యువకుడిని హెచ్చరించాడు. ఎలాంటి పని లేకుండా తమ వీధిలో మరోసారి తిరగవద్దు అని సూచించారు. ఈ క్రమంలోనే సతీష్ పై పియుష్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. మరో స్నేహితుడు విక్కీ తో కలిసి కత్తితో విచక్షణారహితంగా ప్రాణాలు పోయేంత వరకు దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఇక ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇక చివరికి నేరాన్ని అంగీకరించారు ఇద్దరు నిందితులు.

Read more RELATED
Recommended to you

Latest news