సీఎం కేసీఆర్ కు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ.. ఎందుకంటే..?

-

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు కి బహిరంగ లేఖ రాశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. స్వామిత్వ పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని లేఖలో పేర్కొన్నారు కిషన్ రెడ్డి. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలలోని ఇళ్లకు ఆస్తి ధ్రువీకరణ పత్రాలను అందించనున్నామని, దీంతో వారికి ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించినట్లు అవుతుందని ఆయన తెలిపారు. ఈ పత్రాల ద్వారా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడంతో పాటు ఇతర ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు కిషన్ రెడ్డి.

గతేడాది జూలై 29న తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కి ఇదే విషయం పై లేఖ రాసినట్లు గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడంలో సీఎం కేసీఆర్ చొరవ చూపించాలని కోరారు. గ్రామీణ ప్రజలకు ప్రయోజనాన్ని చేకూర్చే గృహాల సర్వేకు సంబంధించిన ఈ స్వామిత్వ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే ప్రక్రియను సత్వరమే ప్రారంభించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news