మన నిర్లక్ష్యమే మనకు శిక్ష.. మన జాగ్రత్తే మనకు శ్రీరామరక్ష : కిషన్ రెడ్డి

-

రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలోని 5 రాష్ట్రాల్లో కొవిడ్​ టెస్టులు తక్కువగా ఉన్నాయని.. అందులో తెలంగాణ రాష్ట్రం కూడా ఉందని ప్రధాని మోదీ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్​ బేగంపేటలోని టూరిజం ప్లాజాలో రోటరీ క్లబ్​ ఆఫ్​ హైదరాబాద్​ డెక్కన్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్లాస్మా బ్యాంకును ఆయన ప్రారంభించారు.

kisan reddy
kisan reddy

తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి ప్లాస్మా బ్యాంక్‌ను ఇవాళ ప్రారంభించినట్లు కిషన్​రెడ్డి వెల్లడించారు. ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టిన రోటరీ క్లబ్‌కు అభినందనలు తెలిపారు. ప్లాస్మా థెరపీతో చాలా మంది ప్రాణాలు రక్షించగలుగుతున్నామని.. ఈ విషయంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా ఈ విషయంలో చొరవ తీసుకున్న సైబరాబాద్ కమిషనర్‌ సజ్జనార్​ను ఆయన అభినందించారు.

కరోనా టెస్టుల విషయంలో రాష్ట్రం కింది నుంచి ఏడో స్థానంలో ఉందని కిషన్​రెడ్డి పేర్కొన్నారు. వాటిని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మన నిర్లక్ష్యమే మనకు శిక్ష.. మన జాగ్రత్తే మనకు శ్రీరామరక్ష అని వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇప్పటి వరకు 14 లక్షల ఎన్‌-95 మాస్కులు, 2.41 లక్షల పీపీఈ కిట్లు, 1400 వెంటిలేటర్లు అందజేసినట్లు ఆయన వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news