వివాదంలో కేకే కుమార్తె.. ఆమె ఏమంటున్నారంటే ?    

-

షేక్ పేట్ ఎమ్మార్వోతో వివాదంపై కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి స్పందించారు. నిన్న కేకే కుమార్తె అనుచరులతో కలిసి దాడికి యత్నించింది అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని మీద స్పందిస్తూ ఎమ్మార్వో పై పోలీసులకు కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశానని విజయలక్ష్మి పేర్కొన్నారు. ఓబీసీ సర్టిఫికేట్లు, కల్యాణ లక్ష్మీ సర్టిఫికేట్ల‌కోసం ప్రజలు తిరుగుతున్నారని, ఇదే అంశంపై నా దగ్గరకు కొందరు ప్రజలు వచ్చారని అన్నారు. ఆ సర్టిఫికేట్ల కోసం వెళ్తే ఎమ్మార్వో కార్యాలయంలో పనికావడం లేదని చెప్పారని ఇదే అంశంపై ఎమ్మార్వో కి‌ కాల్ చేశా …సరిగా స్పందించలేదు..కార్యాలయానికి వెళ్ళానని అన్నారు.

ఎమ్మార్వో బయటకు వచ్చి సరిగా స్పందించ లేదని కారు ఎక్కి వెళ్లిపోబోతున్నారని ఆమె అన్నారు. నా అనుచరులు శ్రీనివాస్ రెడ్డికి నేను  వచ్చినట్లు చెప్పారు …అయినా ఆగకుండా వెళ్లిపోబోయారని ఓ మహిళకు ఇవ్వాల్సిన గౌరవం ఎమ్మార్వో ఇవ్వలేదని ఆమె అన్నారు. ప్రజలు, విద్యార్ధుల కోసం నేను ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లా అంతే కానీ ….కొట్లాటకు నేను వెళ్లలేదని అన్నారు. మేడం, మీరు అనకుండా నువ్వు అంటూ మాట్లాడారన్న ఆమె నువ్వు అనే పదం మాట్లాడొద్దన్నాను…దౌర్జన్యం చేస్తున్నారా అని ఎమ్మార్వో ప్రశ్నించారని అన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news