మధుర, జ్ఞానవాపీలతో ముస్లిమ్స్ కి భావోద్వేగాలు లేవు: కెకె మహమ్మద్

-

అయోధ్యలో ఆలయం పూర్తయిపోయింది ప్రాణ ప్రతిష్ట కూడా పూర్తయింది ఈ సందర్భంగా ప్రముఖ ఆర్కియాలజిస్ట్ కేకే మహమ్మద్ కీలక వ్యాఖ్యలు చేశారు. మధురలో శ్రీకృష్ణ జన్మ స్థలాన్ని కాశీలో జ్ఞానవాపీ ప్రాంతాలని హిందువులకి ఇచ్చేయాలని ఆయన ముస్లింలకి సూచించారు. రాముడు శివుడు కృష్ణుడు వున్నా ప్రాంతాల్లో హిందువులకి ఎంతో భావోద్వేగాలు ఉంటాయని ఆయన అన్నారు ఈ ప్రాంతాలతో ముస్లింలకి పెద్దగా భావోద్వేగం ఉండదని వాటిని పవిత్ర ప్రాంతాలుగా చూసుకుని హిందువులకు ఇచ్చేయండి అని సమస్యకి పరిష్కారం అదే అని కేకే మహమ్మద్ సూచించారు.

ఈయన గతం లో అయోధ్య బాబ్రీ మసీదు కేసు లో ఒక ఆర్కియాలజిస్ట్ గా కీలక పాత్ర పోషించారు ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మధుర జ్ఞానవాపీల తో ముస్లింల కి పెద్దగా భావోద్వేగాలు లేవని హిందువులకి వాటిని ఇచ్చేయాలని చెప్పడంపై ఈ విషయం చర్చనీయాంశంగా మారింది దేశవ్యాప్తంగా కూడా ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు

Read more RELATED
Recommended to you

Latest news