బీజేపీపై పెట్రోల్‌, టీడీపీ పై డీజిల్‌ పోసి ప్రజలు తగలబెట్టారు : కొడాలి నాని

-

బీజేపీ పార్టీపై మంత్రి కొడాలి నాని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. బీజేపీపై పెట్రోల్‌, టీడీపీ పై డీజిల్‌ పోసి ప్రజలు తగలబెట్టారని కొడాని నాని మండిపడ్డారు. బద్వేల్ ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కుమ్మక్కై పోటీ చేసినా డిపాజిట్లు రాలేదని చురకలు అంటించారు. పశ్చిమ బెంగాల్ లో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగితే మూడింట బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదని ఫైర్‌ అయ్యారు.

kodali-nani

వచ్చే ఎన్నికల్లో ప్రజలు పెట్రోల్, డీజిల్ పోసి నిప్పంటిస్తారని భయపడి 5 రూపాయలు తగ్గించారని మండి పడ్డారు. 50 రూపాయలు పెంచి ఇప్పుడు 5 రూపాయలు తగ్గించి బీజేపీ నేతలు మీరెంత తగ్గిస్తారని అడుగుతున్నారని మండి పడ్డారు. సర్ ఛార్జీలు, సెస్సులు, పెట్రోల్ ఉత్పత్తుల వంటి అని… ఢిల్లీ బీజేపీ.. సిల్లీ బీజేపీ అని ఆగ్రహించారు. వాళ్ళు చేసిన పాపాలను జగన్ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారని… దేశాన్ని ఏలే పార్టీ అని చెప్పుకుంటున్నా… ఈ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు కూడా గెలవలేని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. ప్రజలు ఈ స్థాయిలో బుద్ధి చెబుతున్నా…ఇంకా రాష్ట్ర బీజేపీ నేతలకు బుద్ధి రావటం లేదని మండిపడ్డారు. చంద్రబాబు ఓ వృద్ధ జంభూకమని చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news