పట్టాభిపై రెచ్చిపోయిన కొడాలి నాని

-

టిడిపి నేత పట్టాభి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని. గన్నవరం ఘటనలకు కారణమైన టిడిపి నేత పట్టాభి పనికిమాలిన 420 అని విమర్శించారు. పట్టాభి మీడియా ముందుకు వచ్చి చెప్పేవన్నీ అబద్ధాలేనని విమర్శించారు. పోలీసులు దాడి చేశారని పట్టాభి కోర్టులో అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. పట్టాభి చుట్టూ రాజకీయాలు తిప్పేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. పట్టాభిని గన్నవరం ఎవరు పంపారని ఆయన ప్రశ్నించారు.

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలలో బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అధిక భాగం కేటాయించి ముఖ్యమంత్రి జగన్ సామాజిక విప్లవానికి తెరతీసారని అన్నారు. అందుకే చంద్రబాబు, ఎల్లో మీడియా కుట్రకు తెర లేపారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ ని పొట్టన పెట్టుకున్న వ్యక్తులు రామోజీరావు, చంద్రబాబు అన్నారు. దొంగ రాతలు రాసి మానసికంగా ఇబ్బంది పెట్టి ఎన్టీఆర్ ని కుంగదీశారని అన్నారు. పట్టాభి కోర్టుకు వెళ్లి నన్ను అక్కడ కొట్టారు, ఇక్కడ కొట్టారు అని చేస్తున్న డ్రామాలని రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. త్వరలోనే ఈ 420 గాళ్లందరికీ రాష్ట్ర ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారని అన్నారు కొడాలి నాని.

Read more RELATED
Recommended to you

Latest news