జగన్ రాక్షసపాలన పోవాలి – కన్నా లక్ష్మీనారాయణ

-

ఇటీవల బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పిన సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ నేడు చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. మధ్యాహ్నం తన అనుచరులతో కలిసి మంగళగిరి లో పచ్చ కండువా కప్పుకున్నారు. కన్నాతో పాటు ఉమ్మడి గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల నుంచి భారీగా కాపు సామాజిక వర్గ నేతలు కూడా టిడిపి కండువా కప్పుకున్నారు. మంగళగిరి టిడిపి పార్టీ కార్యాలయానికి భారీ ర్యాలీతో చేరుకున్న ఆయనకు చంద్రబాబు టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఇప్పటిదాకా తాను బిజెపిలో ఉన్నానని, ప్రపంచమంతా భారతదేశం వైపు చూసేలా ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలిస్తున్నారని అన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగన్ రాక్షస పాలన పోవాలని, అమరావతి రాజధాని కావాలన్న కారణంతోనే టిడిపిలోకి వస్తున్నానని స్పష్టం చేశారు. తండ్రిని మరిపించేలా పరిపాలిస్తానంటూ ఒక్క ఛాన్స్ అడిగి అధికారంలోకి వచ్చిన జగన్.. సంక్షేమం అంటూనే చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ ఎత్తుకు వెళుతున్న విధంగా పరిపాలన చేస్తున్నాడని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news