టీమిండియాలో కోహ్లీదే కీలక పాత్ర : అంబటి రాయుడు

-

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు విరాట్ కోహ్లీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఐపీఎల్‌ లో ప్లేఆఫ్ స్టేజ్‌కు చేరుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై కామెంటెటర్‌గా అంబటి రాయుడు సెటైర్లు వేసిన విషయం తెలిసిందే. ఆరెంజ్ క్యాప్ టైటిల్ తెచ్చి పెట్టిందంటూ పరోక్షంగా కోహ్లీపై రాయుడు కామెంట్స్ చేశారు. ప్లే ఆఫ్ చేరడంతోనే టైటిల్ గెలిచినట్లు సంబరాలు చేసుకున్నారనడంతో కోహ్లీ ఫ్యాన్ అంబటిని టార్గెట్ చేశారు. సోషల్ మీడియాలో అంబటిపై అభ్యంతరకర పోస్టులు పెట్టడంతో పాటు.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ చేసిన విషయం తెలిసిందే.

తాజాగా టీ-20 వరల్డ్ కప్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రదర్శన కీలకం కానుందని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పేర్కొన్నారు. “ఎంతో అనుభవం కలిగిన కోహ్లీ భారత జట్టులో కీలక ఆటగాడు. ఆయనో బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని.. ఆయన బ్యాటింగ్, దూకుడుతనం టీమిండియాకి కీలకం. చివరి టీ20 వరల్డ్ కప్ లోనూ పాక్ పై కోహ్లీ ఇన్నింగ్స్ చూశాం” అని రాయుడు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news