కోహ్లి, జైస్వాల్ వరల్డ్ కప్ లో ఓపెనింగ్ చేయాలి : వసీం జాఫర్

-

జూన్‌ 2 నుంచి 29 వరకూ జరిగే T20 మెగా టోర్నీ కి అమెరికా, వెస్ట్ ఇండీస్ ఆథిత్యం ఇవ్వనున్నాయి. ఈ టోర్నీ కోసం ఇప్పటికే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.కెనడాతో యూఎస్‌ఏ టోర్నీ ఆరంభ మ్యాచ్‌ను ఆడనుంది. టీమిండియా జూన్ 5న తన మొదటి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడనున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే… టీమిండియా మాజీ ప్లేయర్ జాఫర్ తన అధికారిక ఎక్స్(ట్విట్టర్) లో ఓ ఆసక్తికరమైన విషయాన్ని పేర్కొన్నాడు.విరాట్ కోహ్లి, జైస్వాల్ ప్రపంచకప్ లో ఓపెనింగ్ చేయాలి. ఇక రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ మూడవ, నాల్గవ బ్యాటింగ్ స్థానాల్లో బ్యాటింగ్ చేయడానికి రావాలని’ చెప్పాడు. స్పిన్‌ ను చక్కగా ఆడుతున్న రోహిత్‌ పై వసీం జాఫర్ ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ & జైస్వాల్ వరల్డ్ కప్ లో ఓపెనింగ్ చేయాలి. ఆ తర్వాత రోహిత్, స్కై మనకు లభించే ఆరంభాన్ని బట్టి 3 లేదా 4 స్థానాలలో బ్యాటింగ్ చేయాలి. రోహిత్ స్పిన్ బాగా ఆడతాడు., కాబట్టి 4 వద్ద బ్యాటింగ్ చేయడం ఆందోళన కలిగించదని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news