కోల్ కతా హైకోర్టు సంచలన తీర్పు.. 23,753 ఉద్యోగాలు రద్దు

-

పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వానికి తాజాగా పెద్ద షాక్ తగిలింది. బెంగాల్ స్కూల్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంపై నేడు తీర్పు వెలువరిస్తూ.. కోల్ క‌తా హైకోర్టు డివిజన్ బెంచ్ 2016 నాటి మొత్తం ప్యానెల్‌ను రద్దు చేయాలని ఆదేశించింది. 9, 10, 11, 12వ తరగతిలో గ్రూప్‌- సీ, గ్రూప్‌- డీలో స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌ చేసిన నియామకాలన్నీ చట్టవిరుద్ధమని తెలిపింది. దీని ద్వారా ఎంపికైన 23 వేల 753 మంది ఉద్యోగాలను రద్దు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుంగా ఇప్ప‌టి వ‌ర‌కూ వారు తీసుకున్న జీతం నాలుగు వారాల్లోగా 12 శాతం వడ్డీతో క‌లిపి తిరిగి ఇవ్వాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.

దీంతో పాటు జీరో పోస్టులపై కొత్త నియామకాలు ప్రారంభించాలని స్కూల్ సర్వీస్ కమిషన్‌ను కోల్ క‌తా హైకోర్టు ఆదేశించింది. దీనిపై సీబీఐ దర్యాప్తు కొనసాగించ‌వ‌చ్చ‌ని, ఈ కేసులో ఎవరినైనా కస్టడీలోకి తీసుకోవచ్చని కోర్టు పేర్కొంది. 23లక్షల మంది అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్లను మళ్లీ మూల్యాంకనం చేయాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. రానున్న 15 రోజుల్లో కొత్త నియామకాలపై తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు అధికార యంత్రాంగానికి తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news