పీసీసీ పదవిపై మరోసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు

-

యాదాద్రి జిల్లా : మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 72 వ జయంతి సందర్భంగా భువనగిరి వద్ద వైస్సార్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ సందర్బంగా పీసీసీ పదవిపై ఎంపీ కోమటిరెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

అన్ని అర్హతలు ఉండి పదవి ఇవ్వకుంటే బాధ ఉంటుందని… బాధ ఉన్నంత మాత్రాన పార్టీ మారతారా ? పేర్కొన్నారు. ఆ బాధ తోనే అప్పుడు అలా మాట్లాడానని పేర్కొన్న కోమటిరెడ్డి… చాలా పార్టీల నుంచి ఆఫర్ వచ్చినా పోలేదని స్పష్టం చేశారు. గతంలో మంత్రి పదవికే తాను రాజీనామా చేసానని.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ఏ పదవి అవసరం లేదని వెల్లడించారు.

భువనగిరి ఎంపీ గా రూపాయి ఖర్చు లేకుండా కాంగ్రెస్ కార్యకర్తలు గెలిపించారని… నాకు పార్టీ మార్చే అవసరం లేదన్నారు. పార్టీలో గ్రూపులు కట్టే అవసరం తనకు లేదని… మోసం చేసే అలవాటు అసలే లేదని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news