ఏపీ ప్రభుత్వంపై పట్టాభి మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు

-

ఏపీ ప్రభుత్వంపై పట్టాభి మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. గృహనిర్మాణంపై మంత్రి జోగి రమేష్ రోగి రమేష్ లా అసత్యాలు మొరుగుతున్నారని.. గృహనిర్మాణం, ఇళ్ల పట్టాల విషయంలో జగన్ రెడ్డి అండ్ కో కోట్లాది రూపాయలు దిగమింగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్ల టీడీపీ పాలనలో 7.82 లక్షలకు పైగా పేదలకు పక్కా గృహ నిర్మాణం జరిగిందని అసెంబ్లీలో గత మంత్రి రంగనాథరాజే స్వయంగా వెల్లడించారన్నారు.

గత మూడేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 60, 700 ఇళ్ల నిర్మాణం మాత్రమే జరిగిందని కేంద్ర మంత్రి పార్లమెంట్ లో సమాధానం ఇచ్చారని.. దద్దమ్మ ముఖ్యమంత్రి పనికి మాలిన ప్రభుత్వం వల్లే గత రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో గృహ నిర్మాణం అధ్వాన్నంగా ఉందని ఓ రేంజ్‌ లో మండిపడ్డారు. గత మూడేళ్లలో గృహ నిర్మాణానికి కేటాయించింది కేవలం రూ. 12.23 వేల కోట్లు అయితే, ఖర్చు చేసింది రూ. 5. 89 వేల కోట్లు మాత్రమేనని.. గృహనిర్మాణానికి 50 వేల కోట్లు ఖర్చు చేస్తామంటూ అసత్య ప్రకటనలు ప్రభుత్వం ఇస్తోందని చెప్పారు.

యూపీ, గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలు గత మూడేళ్లలో లక్షలాది ఇళ్లు నిర్మించాయని జోగి రమేష్ తెలుసుకోవాలని.. జగనన్న కాలనీల నిర్మాణానికి ఇప్పటి వరకూ కేవలం 5.43లక్షల మెట్రిక్ టన్నులు ఇసుక మాత్రమే ఇచ్చినట్లు సమాచార హక్కు సమాధానం ఉందని వెల్లడించారు. సీఎం జగన్ మాత్రం 3.10కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక ఉచితంగా ఇస్తున్నట్లు అసత్య ప్రకటనలు ఇచ్చారని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news