కొత్త‌గూడెంలో గ్యాంగ్ వార్ కలకలం

-

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా కేంద్రం అయిన కొత్తగూడెంలో రెండు వ‌ర్గాల‌ ఘ‌ర్ష‌ణ‌ ఉద్రీక్త‌త‌ల‌కు దారితీసింది. కొత్త‌ గూడెం ప‌ట్ట‌ణ పోస్టాఫీస్ సెంట‌ర్ లో బాబూ క్యాంప్, బర్మా క్యాంప్ కాల‌నీ ల‌కు చెందిన‌ యువ‌కుల‌ మ‌ద్య‌ నెల‌ కొన్న వివాదం భౌతిక దాడుల‌కు దారితీసింది. పట్టణంలో ఉన్న ప్ర‌దాన‌ రహదారి మీద ఈ రెండు వర్గాల గ్యాంగ్ వార్ తో జ‌నం హ‌డ‌లిపోయారు.

ఈ దాడుల‌లో 9 మందికి గాయాల‌య్యాయని అంటున్నారు. అందులో ఇద్ద‌రి కి తీవ్ర‌గాయాలు కావ‌టంతో వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించారని అంటున్నారు. కొత్త గూడెం వన్ టౌన్ పోలీసులు ఘ‌ట‌ణా స్థలానికి చేరుకుని సిసి కెమెరా విజువ‌ల్స్ ఆధారంగా దాడుల‌కు పాల్పడిన‌ వ్య‌క్తుల‌ను గుర్తించారు. ప్రశాంతంగా ఒక్క సారిగా గ్యాంగ్ వార్ ఘ‌ట‌ణ‌తో స్థానికంగా ఆందోళ‌న నెలకొంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news