మ‌రో వివాదంలో చిక్కుకున్న వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి..

-

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే, వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో వివాదం లో చిక్కుకున్నారు. ఆయన ఏకంగా ప్రభుత్వ అధికారిణి అయిన ఎంపీడీవో ఇంటిపై దాడి చేసారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. వివ‌రాల్లోకి వెళ్తే.. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కోటంరెడ్డితో పాటు అనుచరుడు శ్రీకాంత్‌రెడ్డిపై ఎంపీడీవో సరళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కల్లూరిపల్లిలోని ఇంటికి వచ్చి బీభత్సం సృష్టించారని ఎంపీడీవో సరళ తెలిపింది. లేఅవుట్‌కు అనుమతి ఇవ్వలేదన్న కారణంతో ఎంపీడీఓపై కోటంరెడ్డి దౌర్జన్యం చేశారు. తన ఇంటికి వచ్చి దౌర్జన్యం చేశారని, వాటర్‌, కేబుల్‌ కనెక్షన్‌ తొలగించి బెదిరించారని కోటంరెడ్డిపై సరళ ఫిర్యాదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news