అర్ధరాత్రి పిలిచినా వస్తాను: కోటంరెడ్డి

-

ఈ రోజు నెల్లూర్ జిల్లా నెల్లూరు నగర రాజకీయాలలో భాగంగా టీడీపీని వచ్చే ఎన్నికల్లో గెలిపించడమే లక్ష్యంగా నెల్లూర్ సిటీ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి నారాయణ ఆధ్వర్యంలో నగర టీడీపీ ఆఫీస్ లో కీలక నేతలు అంతా హాజరయ్యారు. ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ నెల్లూర్ సిటీ నియోజకవర్గం లో 2024 ఎన్నికల్లో గెలిచేది టీడీపీ అని నొక్కి వక్కాణించారు. సిటీ ఎమ్మెల్యే గా నారాయణ ను ఎలాగైనా కష్టపడి గెలిపించుకుని తీరుతామన్నారు కోటంరెడ్డి. ఈ నెల్లూర్ సిటీ లో ఈ కార్యకర్తకు ఎటువంటి అవసరం వచ్చినా ఆదుకోవడానికి నాకు చేతనైన సాయం చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని మాటిచ్చారు. యుద్ధంలో సైనికాద్యక్షుడిగా అర్థ రాత్రిలో పిలిచినా వస్తానని చెప్పారు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి.

కాగా నిన్న టీడీపీ రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి గా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. ఈ మీటింగ్ లో బూతు స్థాయిలో కన్వీనర్ లతో సమావేశం అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news