మూడోసారి అధికారంలోకి వస్తే.. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుంది : మోదీ

-

ఢిల్లీలో ప్రగతి మైదాన్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గెలిచి బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తుందని, అప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే మూడో స్థానానికి ఎగబాకుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత దేశంలో మౌలిక సదుపాయాల్లో మార్పు వచ్చిందని, తూర్పు నుండి పడమరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు ఎన్నో సౌకర్యాలు వచ్చినట్లు చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు బ్రిడ్జి, అతి పొడవైన సొరంగం దేశంలో ఉన్నాయన్నారు. అత్యంత ఎత్తైన మోటార్ రోడ్డు, అతిపెద్ద స్టేడియం, అత్యంత పెద్ద విగ్రహం మన వద్దనే ఉన్నాయన్నారు.

NDA's Vote Share Will Go Over 50% In 2024": Top Quotes From PM's Speech

బీజేపీ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ పదో స్థానంలో ఉందని, రెండోసారి అధికారంలోకి వచ్చాక ఐదో స్థానానికి ఎగబాకిందన్నారు. మూడోసారి గెలిచాక ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందని, ఇది మోదీ ఇస్తున్న హామీ అని వ్యాఖ్యానించారు. గత తొమ్మిదేళ్లలో తాము 40,000 కిలో మీటర్ల రైల్వే లైన్లను విద్యుద్ధీకరిస్తే, 60 ఏళ్లలో 20,000 కిలో మీటర్ల రైల్వే లైన్ ను మాత్రమే విద్యుద్ధీకరించారన్నారు. ఇప్పుడు ప్రతి నెల 6 కిలో మీటర్ల మెట్రో లైన్ ను పూర్తి చేస్తున్నామన్నారు. 4 లక్షల కిలో మీటర్ల మేర గ్రామాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. విమానాశ్రయాల సంఖ్య 150కి చేరుకుందన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news