కెసిఆర్ తన్ని బయటకు పంపే వరకు ఆత్మగౌరవం గుర్తు రాలేదా : ఈటలపై కౌశిక్ రెడ్డి ఫైర్

-

మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అమర వీరుల స్థూపం వద్దకు వెళ్ళిన ఈటెల.. ఇన్నాళ్లు ఎక్కడ పోయారని నిలదీశారు. ఇన్నాళ్లు అమర వీరుల స్తూపం దగ్గరకు ఎందుకు పోలేదు.. ఒక్క అమర వీరుల కుటుంబాన్ని పరామర్శంచిన దాఖలాలు ఉన్నాయా..? అని నిలదీశారు. ఈటెల నువ్వు ఒక్కటి మాట్లాడితే… నేను రెండు మాట్లాడతా అని ఫైర్ అయ్యారు. పంచాయతీ నీకు..కెసిఆర్ కు.. మధ్యలో నన్ను లాగితే ఊరుకోనని హెచ్చరించారు. Sc,st ల్యాండ్స్ కొనిద్దని తెలియదా..ఈటలను వెంటనే జైల్ కు పంపాలన్నారు. నేను చేసిన ఆరోపణల్లో తప్పు అయితే జైలుకు పోతా… నీ ఆరోపణల తప్పు ఐతే జైలుకు పోతావా ? అని సవాల్ విసిరారు.

నీకు..కెసిఆర్ మద్య పంచాయతీలో తనను ఎందుకు మధ్యలో లగుతున్నావని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీల ఆత్మగౌరవం గుర్తు రాలేదా..? కెసిఆర్ నిన్ను తన్ని బయటకు పంపే వరకు రాజీనామా చేయాలనే ఆత్మగౌరవం గుర్తు రాలేదా ? అని నిలదీశారు. నీ ఇంట్లోనే నీకు ఆత్మగౌరవం లేదు.. నువ్వు దొంగవు… నీ వ్యక్తి గత సమస్యలతో రాజీనామా చేసి… ఆత్మగౌరవం అంటావు ఎందుకు? అని కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. హుజురాబాద్ లో ఈ సారి కాంగ్రెస్ జెండా ఎగరేస్త అని స్పష్టం చేశారు. నన్ను తెరాసలోకి రా అని అడగలేదు..అడిగిన పోననని క్లారిటీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news