టీడీపీపై కోవూరు ఎమ్మెల్యే చురకలు… డ్రామా ఆర్టిస్టుల పార్టీ అంతో కామెంట్స్ !

-

ఈ రోజు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి రాష్ట్రంలో జగన్ అన్న చేస్తున్న సంక్షేమాన్ని గురించి మాట్లాడుతూ.. మధ్యలో టీడీపీ గురించి ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. టీడీపీలో కొందరు డ్రామా ఆర్టిసులు ఉన్నారని చురకలు అంటించారు. గతంలో కనిగిరి లో ఉన్న రిజర్వాయిర్ విషయంలో జరిగిన దారుణాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. టీడీపీ నాయకులు రిజర్వాయిర్ లో ఉన్న గ్రావెల్ ను సైతం మాయం చేసిన ఘనత వీరికే దక్కుతుంది. అప్పుడు అభివృద్ధి చేయకుండా ఇప్పుడు జగన్ చేస్తున్న కార్యక్రమాలను చూసి ఓర్వలేక నాటకాలు చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మీరే నిర్ణయించుకోండి డ్రామా ఆర్టిస్టులు ఉన్న టీడీపీ కి ఓటేస్తారా లేదా ప్రతి క్షణం ప్రజల కోసమే ఆలోచించే జగన్ కు ఓటేస్తారా అని సూటిగా చెప్పారు. కాగా ఈ మధ్య ఈయన పార్టీ మారుతున్నారని ప్రచారం విస్తృతంగా జరిగిన నేపథ్యంలో వీటిని ఖండించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version