40 రోజుల‌లో షూటింగ్‌ పూర్తి చేసిన క్రిష్..!?

-

టాలీవుడ్ లో కొందరు డైరెక్టర్లు చాలా ఫాస్ట్ గా షూటింగ్ లు పూర్తి చేస్తారు. అందులో ముఖ్యంగా పూరి జగన్నాథ్, క్రిష్ వంటి డైరెక్షన్ లో తీసే సినిమాలు తగ్గువ రోజుల్లోనే షూటింగ్ లు పూర్తి అవుతాయి. తాజగా డైరెక్టర్ క్రిష్ ప్రేమకథ సినిమాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. క్రిష్ , బాలకృష్ణ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా కూడా 80 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకుంది.

తాజాగా క్రిష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ చాలా వరకు వికారాబాద్ అడవిలోనే చిత్రీకరణ జరిగింది. మరోవైపు కరోనా వైరస్, భారీ వర్షాలు అని కూడా చూడకుండా ఈ సినిమా షూటింగ్ కేవలం 35 రోజుల్లోనే పూర్తి చేసుకున్నారు. ఇక ఈ సినిమాలో ఒక పాట షూటింగ్ మాత్రం మిగిలి ఉంది. ఆ పాట షూటింగ్ కి కేవలం ఐదు రోజులు సరిపోతుందని అంటున్నారు చిత్ర బృందం. ఇక 40 రోజుల్లోనే షూటింగ్ పూర్తి కావడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తుంది. అలాగే ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా లొకేషన్ కు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news