ఉగ్రవాదులకు పాక్‌ తుపాకులు..చైనా డ్రోన్స్‌తో సప్లై!

-

కుక్క తోక వంకర అన్న సామెత పాకిస్థాన్‌కు సరిగ్గా పని చేస్తుంది..ఉద్రవాదాన్ని నిర్మూలించడంలో అనేక అంతర్జాతీయ సంస్థల్లో ఎదురుదెబ్బలు తగిలిన తన తీరు మార్చుకోవడం లేదు పాక్‌..తాజాగా భారత సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాదులకు ఆయుధాలను సరఫరా చేడానికి కొత్త మార్గం ఎంచుకుంది..ఆయుధాలను ఎయిర్ డ్రాప్ చేయడానికి పాక్‌ చైనా డ్రోన్లను ఉపయోగిస్తోంది..

ముప్పై మూడు ఎకె 47 రైఫిల్స్, 28 పిస్టల్స్, అర డజను ఎం 16 రైఫిల్స్, అండర్ బారెల్ గ్రెనేడ్ లాంచర్లు, స్నిపర్ రైఫిల్స్, మూడు డజన్ల మ్యాగజైన్స్, గ్రెనేడ్లు మరియు 500 కి పైగా రౌండ్ల మందుగుండు సామగ్రిని జూన్ 8 మధ్య పాకిస్తాన్ చైనా డ్రోన్లను ఉపయోగించి భారత భూభాగంలోకి పంపించినట్లు ఐబీ వర్గాలు తెలిపాయి.. అక్టోబర్ 12న పాకిస్తాన్ నుండి ఎగురుతున్న డ్రోన్లను, మందుగుండు సామగ్రి అంతర్జాతీయ సరిహద్దు వెంట భారత భద్రతా దళాలు స్వాధీనం చేసుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది..పాకిస్థాన్ భూభాగం కేంద్రంగా పని చేస్తున్న ఉద్రవాదులకు ఆయుధాలను సరఫరా చేయడానికి చైనా డ్రోన్లను ఉపయోగిస్తుంది..నియంత్రణ రేఖ వెంబడి భారత్ ఎక్కువ మంది సైనికులను మోహరించడంతో, ఐఎస్ఐ ఇప్పుడు చైనా డ్రోన్ల వాడకాన్ని ఆశ్రయిస్తోంది..పాకిస్తాన్ భూభాగం నుండి ఎగురుతున్న ఈ క్వాడ్‌కాప్టర్లు చైనాలో తయారు అయ్యాయని..ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని తీసుకుపోవడంతో ఇవి సమర్థవంతంగా పని చేస్తాయని అధికారులు తెలుపుతున్నారు..ఆయుధాలను టెర్రరిస్టులకు సరఫరా చేసిన తరువాత వాటిని భారత భూభాగంలోకి పడవేస్తారు..కాశ్మీర్ లో ఉగ్రవాద దాడులు చేయడానికి టెర్రరిస్టులకు ఈ ఆయుధాలను పాక్‌ అందిస్తుందని సీనియర్ భద్రతా అధికారి తెలిపారు..

చైనా డ్రోన్లు పాకిస్తాన్‌కు చౌకగా వస్తాయి, తక్కువ వేగంతో ఎక్కువ గంటలు ప్రయాణించగలవు.. డ్రోన్‌ల తయారీలో చైనా ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది..వినియోగదారులకు డ్రోన్‌కు సంబంధించిన సాంకేతిక సౌలభ్యాన్ని అందిస్తుంది చైనా..ఇది పాకిస్తాన్ గూఢచార సంస్థకు ప్రయోజనం చేకూర్చింది..వందలాది డ్రోన్‌లను పాకిస్తాన్‌లోని రాష్ట్ర మరియు రాష్ట్రేతరులకు సరఫరా చేసింది..దీంతో పాక్‌ చైనా డ్రోన్లను విరివిరిగా వాడుతుంది..

గత ఒక సంవత్సరంలో ఆర్టికల్ 370 ను ఉపసంహరించుకున్న భారత చర్యకు వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతు పొందడంలో పాకిస్తాన్ విఫలమైంది..ఆగస్టులో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఈ అంశాన్ని లేవనెత్తడానికి పాకిస్తాన్ మరియు చైనా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి..కాశ్మీర్‌లో జోక్యం చేసుకోవడంపై పాకిస్తాన్‌ను నిరాశపరిచింది.దీంతో ఇస్లామాబాద్ విషయాలను మరింత దిగజార్చినది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, గ్లోబల్ టెర్రర్ యాంటీ ఫైనాన్సింగ్ వాచ్ డాగ్‌ వంటి సంస్థలు..పాక్‌ కేంద్రంగా బహిరంగంగా పనిచేస్తున్న టెర్రర్లకు అందుతున్న మౌలిక సదుపాయాలను నివారించాలిని, కఠనమైన నిర్ణయాలు తీసుకోవాలని..దాని కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని అంతర్జాతీయ సంస్థలు కోరుతున్నాయి..

Read more RELATED
Recommended to you

Latest news