మీరు బ్యాంకులో రుణం తీసుకున్నారా..?? అయితే మీకు ఆర్ధిక శాఖ నుండి ఒక శుభవార్త.. !!

-

ఆర్థిక సమస్యల వల్లగాని, బిజినెస్ చేయడం కోసం గాని, చదువు నిమిత్తం గాని, మరేదో కారణాల వల్ల చాలా మంది బ్యాంకు లో కొంత డబ్బును లోన్ రూపంలో అప్పు తీసుకుంటారు..అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అలా లోన్ తీసుకున్న వారికీ తీపికబురు అందించేందుకు సిద్ధం అవుతోంది.మన దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా ఇప్పుడు లోన్ మారటోరియం వడ్డీ మినహాయింపు అంశానికి సంబంధించి కొన్ని ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ 19 కారణంగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI లోన్ మారటోరియం బెనిఫిట్ కల్పించిన విషయం తెలిసిందే.

money
money

అయితే ఇప్పుడు రూ.2 కోట్ల వరకు రుణాలు పొందిన కస్టమర్లు ఈఎంఐ మారటోరియం బెనిఫిట్ పొంది ఉంటే గనుక వారు ఆరు నెలల లోన్ మారటోరియం కాలానికి గానూ వడ్డీ మీద వడ్డీ చెల్లించాల్సిన పని ఉండదు. ఈ భారం మొత్తం కేంద్ర ప్రభుత్వమే మోస్తుంది అన్నమాట. అంటే వడ్డీ మీద వడ్డీ మాఫీ నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వానికి రూ.6,500 కోట్లు అదనపు భారం పడనుంది.ఇదిలా ఉంటే మన దేశ అత్యున్నత న్యాయస్థానం త్వరగా లోన్ మారటోరియం వడ్డీ మీద వడ్డీ మాఫీ నిర్ణయాన్ని త్వరగా అమలు చేయాలని ఇప్పటికే మోదీ సర్కార్‌ను ఆదేశించింది.

ఆర్థిక శాఖ తాజా మార్గదర్శకాల ప్రకారం చూస్తే.. మార్చి 1 నుంచి ఆగస్ట్ 31 వరకు లోన్ మారటోరియం కాలానికి మాఫీ వర్తిస్తుంది.అయితే ఫిబ్రవరి చివరి నాటికి రూ.2 కోట్లకు లోపు ఉన్న రుణాలకు మాత్రం కేంద్రం బెనిఫిట్ వర్తిస్తుంది. ఇకపోతే ఎటువంటి లోన్స్ కు ఈ బెనిఫిట్ అందుతుందంటే … హౌసింగ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, క్రెడిట్ కార్డు రుణాలు, వెహికల్ లోన్స్, రుణాలకు ప్రభుత్వపు వడ్డీ మీద వడ్డీ మాఫీ అందుబాటులో ఉంటుంది. బ్యాంకులు, ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలు వచ్చే వడ్డీ డబ్బులును కస్టమర్ల లోన్ అకౌంట్‌లో జమ చేస్తాయి. కేంద్రప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చాలామంది రుణ గ్రహీతలకు ఊరట లభించనుంది.. !!

Read more RELATED
Recommended to you

Latest news