టాలీవుడ్ పై కృతి శెట్టి సంచలన వ్యాఖ్యలు..

-

యంగ్‌ అండ్‌ టాలెంటడ్‌ హీరో నితిన్ కథనాయకుడిగా.. అందాల ముద్దుగుమ్మ కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’. అయితే.. ఈ సినిమాలో నితిన్‌ కలెక్టర్ పాత్ర పోషిస్తున్నారు. ఆదిత్య మూవీస్ &ఎంట‌ర్టైన‌మెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్ల‌పై ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్ర‌ముఖ ఎడిట‌ర్ ఎమ్‌.ఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతూ తెర‌కెక్కించిన ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల‌లో మంచి అంచ‌నాలే ఉన్నాయి.

అవుట్ అండ్ అవుట్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం ఆగ‌స్టు 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే.. హీరోయిన్‌ కృతి శెట్టి ప్రమోషన్స్‌ పనిలో పడిపోయింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా కృతి శెట్టి వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తోంది. ఈ సందర్భంగా కృతి శెట్టి తన బాలీవుడ్‌ ఎంట్రీ పై ఆసక్తి కర వ్యాఖ్యు చేశారు.

తనకు శ్యామ్‌ సింగరాయ్, బంగార్రాజు సినిమాల తర్వాత బాలీవుడ్‌ ఆఫర్‌ వచ్చిందని తెలిపింది. అయితే.. తనకు టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ ఏది కావాలో అది ఇచ్చిందని.. అందుకే బంగారం లాంటటి బాలీవుడ్‌ ఛాన్స్‌ ను వదులుకున్నాను అని వెల్లడిచింది ఈ బ్యూటీ. తనకు బాలీవుడ్‌ కంటే టాలీవుడే ఇష్టమని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కృతి శెట్టి చేసిన కామెంట్స్‌ వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news