సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బంఫర్ ఆఫర్..!

-

తెలంగాణ  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాని బీఆర్ఎస్ వర్కింగ్
ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మూసీ శుద్ధిపై కేటీఆర్ పవర్
పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కసాబ్ ఎవరనేది ప్రజలు తెలుస్తారు.. కానీ రేవంత్రెడ్డి ‘రెజువెనేషన్’ అనే పదం పేపర్ చూడకుండా స్పెల్లింగ్ చెబితే బంపర్ ఆఫర్ ఇస్తానని చెప్పారు. స్పెల్లింగ్ చెబితే  రూ.50 లక్షల రూపాయలు పట్టే కొత్త బ్యాగ్ కొనిస్తా అని ప్రకటించారు.

ఎందుకంటే సీఎం రేవంత్ కి  బ్యాగులు అవసరమని, ఢిల్లీకి డబ్బులు మోయాలి కాబట్టి మా పార్టీ తరపున గిఫ్ట్ పంపిస్తానని సెటైర్లు వేశారు.  సీఎం రేవంత్రెడ్డి మూసీపై అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని, ఢిల్లీకి మూటలు పంపటం కోసమే ముఖ్యమంత్రికి మూసీపై ప్రేమ అని విమర్శించారు. మూసీ సుందరీకరణ అనే పదం మాట్లాడిందే మొదట రేవంత్ రెడ్డి అని చెప్పారు. లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామని చెప్పింది కూడా రేవంత్ అని, మూసీపై ప్రభుత్వం అసలు
సర్వేనే చేయలేదన్నారు. మూసీ రివర్ పై  గ్రాఫిక్స్ మాయాజాలంతో రేవంత్ అబద్దాలు చెప్పారని
తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version