అశోక్ నగర్ లో గ్రూపు 1 అభ్యర్థులపై లాఠ్ చార్జ్.. ఖండించిన హరీశ్ రావు

-

హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో గ్రూప్-1 అభ్యర్థులు.. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వీడియోలో.. శాంతి యుతంగా నిరసన తెలుపుతున్న గ్రూప్-1 అభ్యర్థులను బలవంతంగా వ్యాన్ లోకి ఎక్కించడం, మహిళా అభ్యర్థులను రోడ్లపై ఈడ్చుకెళ్లడం, రోడ్లపై పరిగెత్తించి మరి కొట్టడం కనిపించింది.


ఈ ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. అశోక్ నగర్ లో గ్రూప్-1 అభ్యర్థులపై పోలీసులు జరిపిన లాఠీచార్జి తీవ్రంగా ఖండించదగినది అన్నారు. అలాగే తమ న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఈ
విద్యార్థులపై తెలంగాణ పోలీసులు అనవసర హింసకు పాల్పడ్డారని, నిరసనకారులు తీవ్రవాదులు
లేదా గూండాలు కాదు, వారు న్యాయం కోరుతూ గ్రూప్-1 ఆశావాదులని గుర్తు చేశారు. గ్రూప్-1 అభ్యర్థులపై లాఠీచార్జ్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు చేటని.. ఇది ప్రజా పాలనకు విరుద్ధంగా
ఉందని, కాంగ్రెస్ నేత, పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తు రాసుకొచ్చారు హరీశ్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version