రేపటి నుంచి నాలుగు రోజుల పాటు సికింద్రాబాద్లో కేటీఆర్ పర్యటన

-

ఈనెల 25న నామినేషన్ దాఖలు ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్ది ఎలాగైనా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్ధులు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. వారికి మద్దతుగా కీలక నేతలు కూడా రంగంలోకి దిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రతో ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారు. ఇక ఇప్పుడు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా ప్రచారాన్ని హోరెత్తించేందుకు రెడీ అయ్యారు.

ఇప్పటికే పలు నియోజకవర్గాల నేతలతో ఆత్మీయ సమ్మేళనాలు, బీఆర్ఎస్ కార్యకర్తలతో విస్తృత సమావేశాలు నిర్వహించిన కేటీఆర్ ఇప్పుడు అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా రేపటి నుంచి వరుసగా నాలుగు రోజులు సికింద్రాబాద్లో కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ నెల 2, 3, 5, 7 తేదీల్లో సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్కు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news