కార్పొరేటర్లను కాపాడుకునే పనిలో కేటిఆర్…?

-

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రాలేదు. ఈ ఎన్నికల్లో అధికార విపక్షాల మధ్య గట్టి పోటీనే చూసాం. అయితే తెరాస మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటుంది అని భావించినా సరే సాధ్యం కాలేదు. ఈ నేపధ్యంలో తన పార్టీ నుంచి విజయం సాధించిన కార్పొరేటర్ లను కాపాడుకునే పనిలో కేటిఆర్ పడ్డారు. తెలంగాణ భవన్ లో వారితో మంత్రి కేటిఆర్  సమావేశం కానున్నారు. గ్రేటర్ మంత్రులు-ఎమ్మెల్యేలు- కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో ఆయన సమావేశం అవుతున్నారు.

ఎన్నికైన కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేయనున్న కేటీఆర్… ఎవరి ప్రలోభాలకు లొంగవద్దు అని సూచించే అవకాశం ఉంది. గ్రేటర్ ఎన్నికల్లో టీఆరెస్ ఓడిన డివిజన్ల పై సమీక్ష చేయనున్న మంత్రి… అభ్యర్ధులతో కూడా సమావేశం అవుతున్నారు. గెలిచిన వారితో ఓడిన వారితో మంత్రి కేటిఆర్ సమావేశం అవుతారు.

Read more RELATED
Recommended to you

Latest news