హైదరాబాద్ వస్తూ మంచి మనసు చాటుకున్న మంత్రి కేటీఆర్

-

హైదరాబాద్: సాటి మనిషి సాయం కోరినా, ప్రమాదంలో ఉన్నా మంత్రి కేటీఆర్ వెంటనే స్పందిస్తారు. ఏ సమయంలోనైనా వారిని రక్షించేందుకు ప్రయత్నం చేస్తారు. ట్విట్టర్, ఫోన్ ద్వారా సమాచారం పంపితే చాలు వెంటనే స్పందిస్తారు. అలాంటి ఘటన తాజాగా ఒకటి జరిగింది. సిరిసిల్లలో పర్యటించి హైదరాబాద్ వస్తున్న సమయంలో రోడ్డుప్రమాదం ఘటన ఆయన కంటపడింది. అంతే వెంటనే చలించిపోయారు. స్వయంగా క్షతగాత్రులను ఆయన కాన్వా‌య్‌లోనే ఆస్పత్రికి తరలించారు. అంతేకాదు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రికి ఫోన్ చేసి వైద్యులకు సూచించారు.

కాగా సిద్దిపేట పట్టణ శివారులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌కు ఢీకొట్టింది. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగింది. ఈ ప్రమాదంలో సిద్దిపేట కాళ్లకుంట కాలనీకి చెందిన జాఫర్‌ (26), యాకూబ్‌ (30) గాయపడ్డారు. ఆ సమయంలో మంత్రి కేటీఆర్ హైదరాబాద్ వెళ్తున్నారు. ప్రమాదాన్ని చూసి తన కాన్వాయ్‌ను ఆపి రెండు వాహనాల్లో క్షతగాత్రులను సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. మంత్రి కేటీఆర్ చేసిన సాయంపై ట్విట్టర్‌లో ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. మంచి మనసు చాటుకున్న కేటీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news