కుక్కల దాడిలో బాలుడి మృతి.. స్పందిస్తూ కేటీఆర్ ట్వీట్

-

ఈనెల 19న వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. కుక్కల దాడిలో బాలుడు మృతి చెందడం దురదృష్టకరమని కేటీఆర్‌ అన్నారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటన తనను ఎంతో కలచివేసిందని చెప్పారు. వీధికుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని ట్వీట్ చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.

ఆదివారం రోజున తండ్రి, అక్కతో పాటు తండ్రి పనిచేసే చోటుకు వెళ్లిన నాలుగేళ్ల ప్రదీప్.. పక్కనే ఆడుకుంటున్న అక్క వద్దకు వెళ్లాలనుకున్నాడు. ఈ క్రమంలో వీధి కుక్కలు ప్రదీప్​ను రౌండప్​ చేశాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు ఆ పిల్లాడు శతవిధాలా ప్రయత్నించినా చివరకు కుక్కలకు సరెండర్ అయిపోయి ప్రాణాలొదిలాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు చూసిన వాళ్లంతా కంటతడి పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version