ఐటీ ఎగుమతులు…ప్రస్తుతం రూ. లక్ష కోట్లు… కేటీఆర్

-

తెరాస అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ఐటీ ఎగుమతులు రూ.56 వేలు కోట్ల నుంచి రూ.లక్ష కోట్లకు చేరాయని కేటీఆర్ తెలిపారు. మన హైదరాబాద్ – మన అందరి హైదరాబాద్’ పేరుతో నిర్వహించిన యువజన సమ్మేళనంలో ఆయన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… తెరాస మళ్లీ అధికారంలోకి వస్తే హైదరాబాద్‌ను ఇన్నోవేషన్ హబ్‌గా మార్చుతామన్నారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో వివిధ పార్టీలకు చెందిన వారు అనేక అపోహలను సృష్టించారని వివరించారు.

హైదరాబాద్‍ విశ్వనగరంగా తీర్చి దిద్దడమే తెరాస లక్ష్యం అన్నారు. కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా అందిరికీ ఒకే రకమైన హక్కులు, భద్రత, విశ్వాసం కల్పించిన ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దామన్నారు.హైదరాబాద్‌లో సుమారు 4.5 లక్షలు మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తోందన్నారు. పరోక్షంగా ఉపాధి పొందుతున్నవారినీ లెక్కిస్తే ఆ సంఖ్య సుమారు 10 లక్షలకు చేరుతుందని తెలిపారు. మరో ఐదేళ్లలో తెలంగాణలో పూర్తి స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తదితర టెక్నాలజీలు హైదరాబాద్‌కు తరలివస్తున్నాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version