రాయలసీమ తెదేపా నేత హత్య

-


కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కె.వెంకటాపురంలో తెదేపా నేత, ఉపముఖ్యమంత్రి కేఈ ముఖ్య అనుచరుడు సోమేశ్‍గౌడ్‌ను గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. శుక్రవారం రాత్రి మద్యం షాపును మూసి.. తన కుమారుడితో కలిసి బైకుపై ఇంటికి వెళ్లున్న సోమేశ్‍గౌడ్‌ను దుండగులు వెంటాడుతూ..కళ్లల్లో కారం చల్లి వేట కొడవలితో దారుణంగా నరికి చంపడంతో అక్కడిక్కడే ప్రాణాలు వదిలారు.

ఈ ఘటనలో సోమేశ్‍గౌడ్‌ కుమారుడికి కూడా గాయాలయ్యాయి. సోమేశ్వర గౌడ్ దేవనకొండ మండల టీడీపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి హంతకుల కోసం గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news