కోడిగుడ్ల కోసం కొట్టుకున్న వైసీపీ నేతలు.. ఏం జ‌రిగిందంటే..

-

కర్నూలు కలెక్టరేట్‌ ప్రాంగణంలో వైసిపి పార్టీ నాయకులు రెచ్చిపోయారు. పాఠశాలకు సప్లై చేసే కోడిగుడ్ల టెండర్లు నందికొట్కూరుకు చెందిన యువనేత, డోన్ నాయకుడు దక్కించుకునేందుకు ప్రయత్నించారు. అయితే మాకు కావాలంటే.. మాకు కావాలని రెండు గ్రూపులు వాదించుకున్నాయి. ఎవరూ తగ్గకపోవడం తోపాటు తిట్ల దండకం మొదలుపెట్టారు. దీంతో వివాదం ముదిరి ఇచివరకు ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. ఈ దాడిలో డోన్ వైసీపీ నాయకుడు సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు.

అయితే DEO ఆఫీసు ఎదుటనే తీవ్రంగా కొట్టుకోవడంతో అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. దుండగులు DEO ఆఫీసులోకి కూడా చొరబడడంతో సిబ్బంది బెంబేలెత్తిపోయారు. ఇంతలో పోలీసుల రాకతో ఈ మూక అక్కడినుంచి పరార్‌ అయింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు కాగా… వారిని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news