జూనియర్ ఎన్టీఆర్ నా ఫోటో చించి అవతల పడేశాడు.. సంచలనం సృష్టిస్తున్న లక్ష్మి పార్వతి ఇంటర్వ్యూ..!

-

తెలంగాణా పొలిటికల్ రిజల్ట్ తేలిపోయింది. మరో ఐదేళ్లు టి.ఆర్.ఎస్ పార్టీ అధికారం వచ్చేసింది. మరో మూడు, నాలుగు నెలల్లో ఏపి ఎలక్షన్స్ జరుగనున్నాయి. ఈ టైంలో అక్కడ పాలిటిక్స్ గురించి కవర్ చేస్తూ ఓ యూట్యూబ్ ఛానెల్ ఎన్.టి.ఆర్ సతీమణి లక్ష్మి పార్వతితో ఇంటర్వ్యూ జరిపారు. ఈ ఇంటర్వ్యూ ప్రోమోనే సంచలనంగా మారింది. ఆమె ఇంటర్వ్యూలో ఎన్.టి.ఆర్ తన ఫోటో చించి అవతల పడేసిన విషయం చెప్పుకొచ్చారు.

అసలు ఎన్.టి.ఆర్ వాళ్ల అమ్మని, ఎన్.టి.ఆర్ ను సీనియర్ ఎన్.టి.ఆర్ దగ్గరకు తీసుకెళ్లింది తానే అంటూ చెప్పుకొచ్చారు లక్ష్మి పార్వతి. పనిలో పనిగా లోకేష్ కు 10 లక్షల తెలుగు ట్యూషన్ పెట్టించారని.. అయినా అతనికి తెలుగు, ఇంగ్లీష్ రెండు సరిగా రావని. అలాంటి వాడిని తెచ్చి మంత్రిగా ప్రజల మీద బలవంతంగా పెట్టారని అన్నారు. జగన్ కు తనకు కొడుకు లాంటి వాడని.. తనకేం పదలు వద్దని.. జగన్ సిఎం కావాలని కోరుకుంటున్నారు లక్ష్మి పార్వతి.

వెదవలు ఎన్ని వెశాలేసినా ఎన్.టి.ఆర్ ఇచ్చిన మనోధైర్యంతో పోరాడుతూ వస్తున్నానని చెప్పుకొచ్చారు. ప్రోమోనే ఇలా ఉంటే ఫుల్ ఇంటర్వ్యూ కచ్చితంగా సంచలనం సృష్టించేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news