బ్రేకింగ్ : విశాఖలో పేలిన ల్యాండ్ మైన్.. జస్ట్ లో మిస్సయిన బలగాలు !

-

విశాఖపట్నంలోని ఆంధ్రా ఒరిసా బోర్డర్ లో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. అయితే ఈ మందు పాత్ర నుండి భద్రతా బలగాలు త్రుటిలో తప్పించుకున్నాయి. భద్రతా బలగాలు కూంబింగ్ కి వస్తున్నాయని తెలుసుకుని మావోయిస్టులు ఈ బాంబ్ బ్లాస్ట్ చేసినట్టు చెబుతున్నారు. ఇక బలగాలు తమ పని తాము మొదలు పెట్టాయి.

నిజానికి ఐదు రోజుల క్రితం శాఖ ఏవోబీలో మావోయిస్టులు అలజడి సృష్టించారు. పోలీస్ ఇన్‌ఫార్మర్ నెపంతో గిరిజనుడిని మావోయిస్టులు హతమార్చారు. ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతమైన పనసపుట్టు పంచాయతీ కోజిరిగూడ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరో ఇద్దరు గిరిజనులను మావోయిస్టులు బాగా కొట్టి ఆ తరువాత విడిచిపెట్టారు. ఈ ఘటనతో గిరిజనలు భయాందోళనకు గురవుతున్నారు. వారికి ధైర్యం చెప్పి మావోయిస్టుల ఆట కట్టించేందుకు భద్రతా బలగాలు వెళ్ళాయి.

Read more RELATED
Recommended to you

Latest news